List of projects Inaugurated by Prime Minister Modi in Visakhapatnamప్రధాని నరేంద్రమోడీ ఈరోజు ఉదయం విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్స్‌లో బహిరంగసభలో పాల్గొని రూ.10,742 కోట్లు విలువగల 5 ప్రాజెక్టులకు రిమోట్ నొక్కి శంకుస్థాపన చేశారు. రూ.7,614 కోట్లు విలువగల మరో 4 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేశారు. ఆ వివరాలు…

రూ.460 కోట్లతో విశాఖ రైల్వే స్టేషన్‌ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన.

రూ.566 కోట్లతో విశాఖలోని కాన్వెంట్ జంక్షన్ వద్ద నుంచి షీలానగర్ వరకు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన.

రూ.12 కోట్లు వ్యయంతో విశాఖ ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన.

రూ.3,778 కోట్లు వ్యయంతో రాయ్‌పూర్ విశాఖపట్నం నగరాలను కలుపుతూ ఎకనామిక్ కారిడార్ (గ్రీన్ ఫీల్డ్ హైవే) శంకుస్థాపన.

రూ.2,658 కోట్లు వ్యయంతో శ్రీకాకుళం నుంచి ఒడిశాకు గ్యాస్ పైప్ లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన.

రూ.2,917 కోట్లు వ్యయంతో విశాఖ తూరుపు తీరంలో నిర్మించిన ఓఎన్‌జీసీ యూ ఫీల్డ్ డీప్ వాటర్ ఆన్‌షోర్ ఆయిల్ ఫీల్డ్ ని జాతికి అంకితం.

రూ.211 కోట్లు వ్యయంతో శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేట-పాతపట్నం నిర్మించిన రహదారిని జాతికి అంకితం.

ఐవోసీయల్ అధ్వర్యంలో గుంతకల్లులో చేపడుతున్న గ్రాస్ రూట్ డిపోలను జాతికి అంకితం.

విజయవాడ-గుడివాడ-భీమవరం-నిడదవోలు రైల్వేలైన్ విద్యుధీకరణ, రైల్వేలైన్ డబ్లింగ్ పనులకు ప్రారంభోత్సవం.