Lavanya-Tripathi-Naga-chaitanya-movieతనను మోడ్రన్ కాస్ట్యూమ్స్ లో చూపించండి బాబోయ్… అంటూ దర్శకులకు తన ఆవేదనను వ్యక్తం చేస్తోన్న ‘అందాల రాక్షసి’ పిల్ల లావణ్య త్రిపాఠి ముచ్చట ఎట్టకేలకు తీరబోతున్నట్లుగా కనపడుతోంది. ఈ సినిమాకు సంబంధించి రెండవ షెడ్యూల్ ముగిసిన నేపధ్యంలో రాజమౌళి తనయుడు కార్తీకేయ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను పోస్ట్ చేస్తూ ట్వీట్ చేసారు.

‘ఓ గొప్ప కంటెంట్ తో ఈ సినిమా సిద్ధమవుతోందని’ చెప్తూ కార్తీకేయ పోస్ట్ చేసిన ఫోటోలలో హీరోయిన్ లావణ్య, చిట్టిపొట్టి డ్రెస్సులతో కనిపించడం విశేషం. రొమాంటిక్ థ్రిల్లర్ కావడంతో, లావణ్య తను అభిలాషించినట్లుగా మోడ్రన్ కాస్ట్యూమ్స్ తో కనిపించడానికి అవకాశం లభించినట్లుగా కనపడుతోంది. దీంతో నాగచైతన్య సినిమాకు పబ్లిసిటీ పరంగా ఇదొక మంచి పరిణామమే అని చెప్పవచ్చు.

లావణ్య త్రిపాఠిని గ్లామరస్ గా చూపించే అవకాశం కొత్త దర్శకుడు కృష్ణ మరిముతుకు చిక్కిందన్న మాట. ఇక, ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తుండగా, వారాహి నిర్మాణ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. కార్తీకేయ చేసిన ట్వీట్ పై హీరోయిన్ త్రిపాఠి కూడా స్పందిస్తూ… నేను కూడా సూపర్ డూపర్ నమ్మకంతో ఉన్నానని, ఈ సినిమా ఫన్ రైడింగ్ గా ఉందంటూ చెప్పుకొచ్చింది.