వరుస అపజయాల తరువాత, అర్జున్ సురవరం విజయంతో లావణ్య త్రిపాఠి తిరిగి ట్రాక్‌లోకి వచ్చింది. ఈ నటి ప్రస్తుతం సందీప్ కిషన్‌ తో ఎ1 ఎక్స్‌ప్రెస్‌ సినిమాలో రొమాన్స్ చేస్తోంది. ఈ చిత్రంలో ఈ నటి హాకీ ప్లేయర్‌గా నటిస్తుంది. ఆమె ఈ పాత్రను పర్ఫెక్ట్ గా పోషించడానికి హాకీ కూడా నేర్చుకుంది.

ఎంతో కష్టపడి సంపాదించిన విజయాన్ని ఎలాగైనా కొనసాగించడానికి ఈ భామ ఆసక్తిగా ఉంది. దీనితో గ్లామర్ పాత్రలకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. “నేను ఒక నటిని మరియు నా పాత్రలు ఛాలెంజింగ్ గా ఉండటానికి ఇష్టపడతాను. సన్నివేశాలు మరియు స్క్రిప్ట్‌లో మంచి విషయం ఉంటే తప్ప బోల్డ్ సన్నివేశాలు చేయడం మరియు బికినీ ధరించడం నాకు ఇష్టం లేదు” అని ఆమె ఒక ఇంటర్వ్యూలో తెలిపింది.

అయితే బికినీ వెయ్యడానికి నేను వ్యతిరేకంగా కాదు అని ఆమె తేల్చి చెప్పింది. లావణ్య ఇప్పటివరకు హోమ్లీ పాత్రలకు మాత్రమే ప్రసిద్ది చెందింది. ఈ తరుణంలో గ్లామర్ పాత్రలు చెప్పడానికి సిద్దపడినా, దర్శకులు ఆ దృష్టితో చూడటం అంత తేలిక కాదు. మరో వైపు, ఈ భామ తన డిజిటల్ అరంగేట్రానికి సిద్ధంగా ఉందని ధృవీకరించింది.

“నా ప్రతిభను ప్రదర్శించడానికి సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్నా. ఈ మధ్యకాలంలో అటువంటి అవకాశాలు ఓటీటీలలో ఎక్కువ వస్తున్నాయి. అటువంటి అవకాశం వస్తే చెయ్యడానికి సిద్ధం,” అని చెప్పుకొచ్చింది ఈ అమ్మడు. ఏ1 ఎక్సప్రెస్ తో పాటు తెలుగులో చావు కబురు చల్లగా, తమిళంలో అథర్వ సరసన ఒక సినిమా చేస్తుంది లావణ్య.