ఏపీలో రాజకీయం రంజుగా మారింది. ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ వాతావరణంలో తన సంచలన వ్యాఖ్యలతో జగన్ రేపిన దుమారంపైనే ప్రస్తుతం చర్చలన్నీ! దీనికి సంబంధించి తాజాగా ఓ టీవీ షోలో వైసీపీ నేత లక్ష్మీపార్వతి పాల్గొన్నారు. ఎన్ఆర్ఐలు మాత్రమే కాల్ చేసి తమ అభిప్రాయాలు చెప్పే అవకాశం ఉన్న ఈ కార్యక్రమంలో ప్రజలు అడిగిన ప్రశ్నలకు నీళ్ళు నమలడం లక్ష్మీ పార్వతి వంతయ్యింది.
ఒక బాధ్యత గల ప్రతిపక్ష నేత మాట్లాడే మాటలేనా ఇవి? అని ముక్తకంఠంతో ప్రశ్నించగా, కడప జిల్లా నేతలు… అందులోనూ వైఎస్ కుటుంబానికి చెందిన వ్యక్తులే అని, గతంలో కోట్ల విజయభాస్కరరెడ్డిపై రాజశేఖర్ రెడ్డి చెప్పులు వేయించిన వైనాన్ని గుర్తు చేస్తూ, ఆనాడు నాయన చేసిందో ఈనాడు కొడుకు కూడా అనుసరిస్తున్నాడు… వంటి తదితర ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఇబ్బంది పడ్డారు లక్ష్మీ పార్వతి.
కాలర్స్ అడిగిన ఇలాంటి అనేక ప్రశ్నలతో వైసీపీ నేత తీవ్ర ఇబ్బందులు పాలవ్వడం విశేషం. అంతేకదా… చేసింది గొప్ప పని అయితే ఎంతైనా సమర్ధించుకోవచ్చు. విమర్శలకు తావిచ్చే విధంగా వ్యాఖ్యానించి, మళ్ళీ వాటికి మద్దతు ప్రకటించాలంటే ఏ నేతకైనా ఇబ్బందే కదా! అలాంటి అనుభూతులనే లక్ష్మీపార్వతి గారు చవిచూసారు.