ktr-haritha-haram-challege-to-mahesh-babu‘హరితహారం’ పేరుతో మొక్కలను నాటుతూ, మరో ఐదుగురిని ఇదే పని చేయాలంటూ సోషల్ మీడియాలో చేస్తోన్న ఛాలెంజ్ లో భాగంగా ఇటీవల కేటీఆర్ తన పనిని పూర్తి చేసి మరో ఐదుగురిని నామినేట్ చేసాడు. ఇందులో నలుగురు ఇప్పటికే తమ కార్యాలను పూర్తి చేయగా, టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు అందుకు దూరంగా ఉన్నారు.

కేటీఆర్ నామినేట్ చేసిన అయిదుగురిలో ముగ్గురు అదే రోజు టాస్క్ ను పూర్తి చేయగా, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ శనివారం నాడు ఆ టాస్క్ ను కంప్లీట్ చేసి మంత్రి కేటీఆర్ కు రిప్లై ఇచ్చారు. దీంతో కేటీఆర్ ఛాలెంజ్ విసిరిన అయిదుగురిలో ఒక్క మహేష్ బాబు మాత్రమే మిగిలి ఉన్నారు.

సోషల్ మీడియాలో ఇప్పటివరకు చాలా ఛాలెంజ్ లు హల్చల్ చేసాయి. అందులో కొన్ని మంచివి ఉంటాయి, మరికొన్ని టైం పాస్ పనులు ఉంటాయి. అయితే వేటిని ప్రిన్స్ సీరియస్ గా తీసుకుని సందడి చేసింది లేదు. సహజంగానే ఇలాంటి సోషల్ మీడియా పనులకు ప్రిన్స్ దూరం. అయితే కేటీఆర్ తో ఉన్న సాన్నిహిత్యంతో హారితహారంలో పాల్గొంటారేమో చూడాలి.