Krishnam raju Praises Chandrababu Naiduఒక పక్క రాష్ట్ర బీజేపీ నాయకులంతా తెలుగు దేశం ప్రభుత్వంపై ముప్పేట దాడి చేస్తుంటే కేంద్రమాజీ మంత్రి కృష్ణంరాజు మాత్రం వేరే పల్లవి అందుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబుపై కృష్ణంరాజు ప్రశంసల జల్లు కురిపించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు.

ఇదే సమయంలో ఆయన బీజేపీకి కూడా వంత పాడారు. పవన్, జగన్‌లకు బీజేపీ స్క్రిప్ట్‌ ఇస్తోందన్న ఆరోపణలను ఆయన ఖండించారు. పాటలు, స్కిట్స్ ద్వారా ప్రజలకు తొందర్లో నిజాలు తెలియజేయనున్నట్లు ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా బీజేపీపై నెగిటివ్ అభిప్రాయం లేదని కృష్ణంరాజు అన్నారు.

బీజేపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో ఏదో ఒక రాష్ట్రానికి కృష్ణంరాజును గవర్నర్ గా పంపే అవకాశం ఉందని వార్తలు తరచు వచ్చేవి. అయితే అవేమి జరగలేదు. 2009 ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోవడం కృష్ణంరాజు రాజకీయ కేరీర్ కు పెద్ద అవరోధంగా మారింది. బీజేపీలో ఆయన ప్రభావము కూడా తగ్గుతూ వచ్చింది.