‘శ్రీమంతుడు’ సినిమా విజయం తర్వాత అందరికీ తలెత్తిన ప్రశ్న ఇది? మళ్ళీ ‘జనతా గ్యారేజ్’ తర్వాత కూడా హల్చల్ చేస్తోంది. ‘మిర్చి’ వంటి హిట్ ఇచ్చిన తర్వాత రెండవ సినిమాగా బండ్ల గణేష్ నిర్మాతగా, రామ్ చరణ్ హీరోగా ఎంతో అట్టహాసంగా మొదలైన కొరటాల సినిమా ఆదిలోనే ఆగిపోయింది. అయితే పూజా కార్యక్రమాలు కూడా జరుపుకున్న ఈ సినిమా ఆగిపోవడానికి గల ప్రధాన కారణం ఏంటి?
మెగా అభిమానులను వేధిస్తున్న ప్రశ్న ఇది. దీనికి అటు కొరటాల నుండి గానీ, ఇటు రామ్ చరణ్ నుండి గానీ ఎలాంటి వివరణ వెలువడలేదు. అయితే ఈ ప్రశ్నకు జవాబు దొరికే సమయం ఆసన్నమైంది. ఆదివారం నాడు ప్రసారమయ్యే ఓ ప్రముఖ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న కొరటాల శివను ఈ ప్రశ్న అడిగాడు సదరు మీడియా అధినేత. మరి ఈ ప్రశ్నకు కొరటాల శివ ఎంత ‘ఓపెన్’గా సమాధానం చెప్పారో తెలుసుకోవాలంటే, ఆదివారం సాయంత్రం వరకు వేచిచూడాల్సిందే.