Koratala Siva - Chiranjeeviమెగా స్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు ఆచార్య అనే పేరు అనుకుంటున్నారు. ఈ సినిమాని ఆగస్టు 14న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చెయ్యాలని ప్లాన్ చేశారు నిర్మాతలు. అయితే ఇప్పుడు ఈ సినిమా ఏకంగా వచ్చే ఏడాది వేసవి వరకు వాయిదా పడిందని వార్తలు వస్తున్నాయి.

వివరాల్లోకి వెళ్తే… ఈ చిత్ర నిర్మాతలలో ఒకరైన రామ్ చరణ్ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించనున్నారని సమాచారం. రామ్ చరణ్ దాదాపుగా సినిమాలో నలభై నిముషాల పాటు కనిపిస్తారని సమాచారం. అయితే ఆగస్టులో విడుదల చెయ్యాలని అనుకున్నాకా రాజమౌళి దానికి అడ్డుచెప్పడట.

ఆర్ఆర్ఆర్ విడుదల తరువాతే చరణ్, ఎన్టీఆర్ ల మిగతా సినిమాలు విడుదల కావాలని ఆయన పట్టుబడుతున్నారు. దీనితో ఆచార్య 2021 వేసవికి వెళ్తుందని అంటున్నారు. ఇదే జరిగితే కొరటాలకు ఇబ్బంది అనే చెప్పుకోవాలి. ఆచార్య 2018లో సెట్స్ మీదకు వెళ్ళాల్సింది. అయితే సైరా షూటింగ్ లేట్ అయ్యింది.

ఇప్పుడు గనుక 2021 వేసవికి సినిమా విడుదలైతే, ఈ ఒక్క ప్రాజెక్టు కోసం కొరటాల మూడేళ్ళ దాకా వెచ్చించినట్టు అవుతుంది. కొరటాల ప్రైమ్ లో ఒక ప్రాజెక్టు కు మూడేళ్లు అంటే దారుణం అనే చెప్పుకోవాలి. అయితే ఈ విషయంలో చిరంజీవికి కొరటాల గట్టిగా కుదరదు అని చెప్పగలరా అనేది చూడాలి.