i-support-mahesh-kathi-mahesh-kathiశ్రీరెడ్డి రేపిన ‘కాస్టింగ్ కౌచ్’ అంశం టాలీవుడ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. మీడియాలో జరుగుతున్న చర్చలలో ఒక్కొక్కరి పేర్లు బహిర్గతం అవుతుండడం సంచలనాత్మకంగా మారుతోంది. ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నా, శివాజీరాజా, కత్తి మహేష్ ల పేర్లు కూడా హంగామా చేస్తున్నాయి.

టీవీ9 ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి శృతి ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజాపై ఆరోపణలు చేయగా, దీనికి శ్రీరెడ్డి ప్రతిగా “శివాజీరాజా కూడానా? నిజమా” అంటూ ఫేస్ బుక్ లో ప్రశ్నించింది. అలాగే కత్తి మహేష్ పై నటి సునీత లైంగిక ఆరోపణలు చేయగా, ‘అమ్మ దొంగి’ అంటూ కత్తి మహేష్ ను ఉద్దేశిస్తూ స్పందించింది.

అయితే తన ఉదంతంలో కత్తి మహేష్ స్పందిస్తూ… నాపై జరుగుతున్న కుట్రలో భాగంగా ఇదంతా కనపడుతోందని, దీని వెనుక చిరంజీవి, పవన్ కళ్యాణ్, కొణిదెల ప్రొడక్షన్స్ అధినేత రామ్ చరణ్ వర్గాలు ఉన్నట్లుగా అనుమానం ఉందని, ఆమెపై 50 లక్షల మేరకు సోమవారం నాడు పరువు నష్టం దావా వేయబోతున్నానని తెలిపాడు.

కొణిదెల ప్రొడక్షన్స్ లో కీలక వ్యక్తి అయిన వాకాడ అప్పారావుపై ‘కాస్టింగ్ కౌచ్’ ఆరోపణలు వచ్చిన నేపధ్యంలో… దీన్నంతా పక్కకు నెట్టడానికి తన పేరును ముందుకు తీసుకువచ్చారని, ఆరోపణలు చేసిన వారు దమ్ముంటే పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేసు పెట్టాలని, అప్పుడే తాను నిర్మలంగా బయటపడగలనని అన్నారు.

ఆదివారం నాడు కోర్టుకు సెలవు గనుక, సోమవారం నాడు ఈ దావా వేయబోతున్నానని, దమ్ముంటే వాళ్ళు కోర్టులో తేల్చుకోవాలని, తాను మహిళలకు సెక్సువల్ మెస్సేజ్ లు పెట్టిన మాట వాస్తవమే, అయితే అది వారికి ఇష్టపూర్వకంగా జరిగినవే తప్ప, ఎవరికీ బలవంతంగా చేసినది కాదని ఈ సందర్భంగా కత్తి వెలిబుచ్చారు.