‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం, శ్రీనివాస కళ్యాణం’ వంటి బుల్లితెర సీరియల్స్ లో పాపులర్ అయిన రోహిణి రెడ్డి, ఇటీవల ‘జబర్దస్త్’లోని ‘చమ్మక్ చంద్ర’ స్కిట్స్ లో కూడా ఎక్కువగా తారసపడుతున్నారు. అలా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న రోహిణి, ఆగష్టు 15వ తేదీ సెలవు రోజు కావడంతో, కృష్ణా పుష్కరాల సందర్భంగా విజయవాడ విచ్చేసిన సందర్భంలో ప్రమాదానికి గురయ్యారు.
హైదరాబాద్ నుండి విజయవాడకు కారులో బయలుదేరిన రోహిణి రెడ్డి, విజయవాడ సమీపానికి చేరుకునే సమయంలో ఇబ్రహీంపట్నం వద్ద ఓ లారీ డీ కొట్టడంతో కారు డ్రైవర్ మరియు అసిస్టెంట్ గాయపడ్డారు. అలాగే రోహిణి రెడ్డి కూడా స్వల్ప గాయాలయ్యాయి. వీరిని గొల్లపూడిలోని ఆంధ్రా ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ప్రస్తుతం అందరి పరిస్థితి క్షేమంగానే ఉందని డాక్టర్లు ధ్రువీకరించారు.