Kiran Talasaliఇప్పటివరకూ ఆయన తెలుగు, తమిళ్ మరియు కన్నడలో పలు సినిమాలకి కో ప్రొడ్యూసర్ మాత్రమే.. కానీ 2021 నుంచీ చిత్ర పరిశ్రమలో నిర్మాతగా మారి తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ తో అందరినీ ఒక్కసారిగా తనవైపు చూసేలా చేయబోతున్నారు. ఆయనే ‘క్రేజీ అంకుల్స్’ తో పరిచయమవుతున్న నూతన నిర్మాత కిరణ్ కె తలశిల.

గత 20 ఏళ్లుగా అమెరికాలో బ్యాంకింగ్ ప్రొఫెషనల్ గా ఎన్నో కర్తవ్యాలను సమర్థవంతంగా నిర్వహించిన కిరణ్ కె తలశిల, సినిమా మీద ఫాషన్ తో అద్భుతమైన కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధం అయ్యారు. అందులో ముందుగా తెలుగు ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నంగా ఇప్పటికే శ్రీముఖితో ‘క్రేజీ అంకుల్స్’ ని ఫినిష్ చేయగా, ‘గోదారి కథలు’, ‘గోల్డ్ మాన్’ మరియు ‘నలుగురితో నారాయణ’ అనే సినిమాలను 2021 సమ్మర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఒక్క తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా తన పాగా ఎగరవేయడానికి ఓ క్రేజీ కాంబినేషన్ లో ‘ఏ కాష్ కె హమ్’ అనే ఓ సరికొత్త ప్రేమకథకి శ్రీకారం చుట్టారు. ఈ సినిమా కోసం బాలీవుడ్ లో ఎన్నో విభిన్నమైన పాత్రలతో మెప్పించి, ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన నాజీరుద్దీన్ షా కుమారుడు వివాన్ షాన్ ని హీరోగా పరిచయం చేస్తూ, హీరోయిన్స్ గా ప్రియా సింగ్ మరియు సోఫియా సింగ్ లను హీరోయిన్స్ గా పరిచయం చేస్తున్నారు. ఇలా టాలెంట్ ఉన్న కొత్తవారి కోసమే కిరణ్ కె తలశిల ప్రతి భాషలోనూ సినిమాలు చేసేలా ప్లాన్ చేశారు.

ఒకేసారి ఇన్ని సినిమాలు లైన్ లో పెడుతున్నారు ఎవరబ్బా ఈ కొత్త నిర్మాత అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే ఈ నిర్మాత కిరణ్ తెలుగు తాలిలా ఇండస్ట్రీలకి కొత్తేమీ కాదు.. 2018 లో వచ్చిన తెలుగు సినిమా ‘భలే మంచి చౌక బేరమ్’, తెలుగు – తమిళ్ ద్విభాషా చిత్రం ‘సెవెన్’, కన్నడ ఫిలిం ‘నాన్న ప్రకార’ మరియు తమిళ హీరో జీవ ‘గొరిల్లా’ సినిమాలకు కో ప్రొడ్యూసర్ గా అందరికీ సుపరిచితుడే.

ఇప్పటికే కిరణ్ డిజిటల్ స్పేస్ లో ఈస్ట్ స్పేస్ ఎంటర్టైన్మెంట్ ద్వారా కిరణ్ కిడ్స్ అండ్ యువతని ఆకట్టుకొని ఇప్పుడు ఎంతో అనుభవంతో నిర్మాతగా సత్తా చాటుకోవడానికి ఈ ఏడాది వరుస సినిమాలతో రానున్నారు. తన టెస్ట్ ఆఫ్ ఫిలిమ్స్ తో కొత్తవారికి అవకాశాలు కల్పిస్తూ, ఓ టాలెంటెడ్ ప్రొడ్యూసర్ గా నిలిచిపోయేలా కిరణ్ కె తలశిల తన కెరీర్ ని ప్లాన్ చేశారు.