గణేష్ ఉత్సవాలలో దేశంలోనే భాగ్యనగరానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అందులోనూ ఖైరతాబాద్ వినాయకునికి ప్రత్యేక గుర్తిపు ఉంటుంది. నిమజ్జనోత్సవం జరిగే తరువాతి రోజు ఉదయాన మాత్రమే ఎప్పుడూ ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం పూర్తవుతుంది. అయితే అందుకు భిన్నం గా ఈ సారి మాత్రం భాగ్యనగర వాసుల కోరిక నేరవేరిందనే చెప్పాలి.
ఎందుకంటే ఎప్పుడూ ఖైరతాబాద్ గణపతి శోభాయత్ర అర్ధరాత్రి నుండి మొదలవడంతో చాలా మందికి ఆ శోభయాత్రలో పాలు పంచుకొనే అవకాశం లేకపోయేది. అయితే ఈ సారి హైదరాబాద్ జి.హెచ్.ఎం.సి. అధికారుల,పోలీస్ వారి ముందస్తు సూచనల మేరకు ఖైరతాబాద్ వినాయకుని శోభాయాత్ర ను మాత్రమే కాకుండా ఆ గణపతి నిమజ్జన కార్యక్రమాన్ని కూడా చూసే అవకాశం భాగ్యనగర వాసులకు దక్కిందనే చెప్పాలి. చరిత్రలో తొలిసారి ఖైరతాబాద్ గణపతి అనుకోన్నరోజే నిమజ్జన ప్రక్రియ పూర్తీ చేసుకోనున్నాడు.
ఈ విధంగా 2016 లో ఖైరతాబాద్ గణపతి కొత్తగా చరిత్ర ఖరారు చేసుకున్నారనే చెప్పాలని హైదరాబాద్ వాసులే కాదు మన తెలుగు వారంతా చెప్పక తప్పదు. అలాగే ఆ వినాయకుని ఆశీస్సులు మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మీద ఉండాలని అందరం ఆశిద్దాం.
“జై భోలో గణేష్ మహరాజ్ కి జై”.
Kakarla