కొన్ని రోజుల క్రితం కర్ణాటకలో కేజీఎఫ్ 2 తన షూటింగ్ను తిరిగి ప్రారంభించింది. రెండు రోజుల క్రితం హీరో యష్ జట్టులో చేరాడు. మంగళూరు బీచ్లో యష్, హీరోయిన్ శ్రీనిధి శెట్టిపై ఒక ముఖ్యమైన సన్నివేశం షూట్ చేశారు. ఈ షెడ్యూల్ తరువాత, బృందం బెంగళూరుకు వెళ్తుంది.
బెంగళూరులో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను షూట్ చేసిన తరువాత, బృందం హైదరాబాద్ లో నిర్మించిన కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ సెట్లో మరో 20 రోజుల షూట్ చేస్తుంది. క్లైమాక్స్తో సహా కొన్ని భారీ యాక్షన్ సన్నివేశాలను వారు అక్కడ చిత్రీకరించనున్నారు. సినిమా షూటింగ్ హైదరాబాద్లో ముగుస్తుంది.
కరోనా బ్రేక్ కారణంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్-ఇండియా చిత్రం దసరా విడుదలకు నోచుకోలేదు. జనవరి 14న సంక్రాంతి సందర్భంగా విడుదలకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. సంక్రాంతికి విడుదల అంటే తెలుగులో కూడా పెద్ద కాంపిటీషన్ ఉండదని టీమ్ భావిస్తుంది. ఒకటి రెండు నెలలలో అధికారిక ప్రకటన ఉండవచ్చు.
ఈ చిత్రంలో బాలీవుడ్ నటులు రవీన్ టాండన్ మరియు సంజయ్ దత్ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. యశ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దుబాయ్ మాఫియాపై యష్ చేసే ఎదురుదాడులు సీక్వెల్లో హైలైట్ గా నిలవనున్నాయని అంటున్నారు. కోలార్ గోల్డ్ మైన్స్ సామ్రాజ్యాన్ని స్థాపించిన సూర్యవర్ధన్ బ్రదర్ గా సంజు బాబా కనిపించబోతున్నాడు.