Kesineni Nani Kanakadurga Flyoverచంద్రబాబు హయాంలో విజయవాడలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు… కనక దుర్గ వారధి. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ దానికి అడ్డు పడే ప్రయత్నం చేసిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కేంద్ర ఇవ్వాల్సిన మాచింగ్ నిధులు ఇవ్వకపోవడంతో దాని నిర్మాణం ఆలస్యం అయ్యింది. చంద్రబాబు హయాంలో 85% పూర్తి అయ్యింది.

జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా మిగిలిన పని పూర్తి చేసి ఓపెనింగ్ కు సిద్ధం అయ్యింది. అయితే ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం తమ ఘనతే అంటూ అధికార పార్టీ ఇప్పుడు సోషల్ మీడియా లో ప్రచారం చేసుకునే ప్రయత్నం చెయ్యడం గమనార్హం. జగన్ చేతుల మీదుగా ఘనంగా ఓపెనింగ్ చెయ్యాలనుకున్నారు.

ఈ తరుణంలో విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని ఝలక్ ఇచ్చారు. దానిని ఓపెన్ చెయ్యాల్సిందిగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఆహ్వానించారు. దానితో వైఎస్సార్ కాంగ్రెస్ తన స్పీడ్ తగ్గించక తప్పలేదు. ఈ ప్రాజెక్టు పై నాని విశేషంగా దృష్టిపెట్టారు. అప్పట్లో నితిన్ గడ్కరీతో తనకు ఉన్న పరిచయంతో దానిని శాంక్షన్ చేయించుకున్నారు.

కనకదుర్గ ఫ్లై ఓవర్ ఈ నెల 18న ప్రారంభం కాబోతుంది. నితిన్ గడ్కరీ చేతుల మీదుగానే ఈ కార్యక్రమం జరుగుతుంది. రాజకీయ సంగతులు ఎలా ఉన్నా… విజయవాడలోని ట్రాఫిక్ కష్టాలు తీర్చడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.