Keerthy Sureshమహానటి సినిమాలో తన అద్భుత ప్రదర్శనతో అందరిని అబ్బురపరిచింది కీర్తి సురేష్. ఆమె టాలెంట్ పై గల అనుమానాలు అన్నీ పటాపంచలు చేసింది. అయితే ఇప్పుడు ఆమె టెంపరరీ గానైనా పెద్ద తెరకు దూరమై ఓటీటీ హీరోయిన్ గా మారిపోతుంది. కీర్తి సురేష్ యొక్క తమిళ చిత్రం, పెంగ్విన్ మరియు దాని తెలుగు డబ్బింగ్ వెర్షన్ థియేట్రికల్ విడుదల కాకుండా నేరుగా ఆన్‌లైన్‌లో విడుదల కాబోతున్నాయి.

ఈ చిత్రం యొక్క ఆన్ లైన్ ప్రీమియర్ జూన్ 19 న అమెజాన్ ప్రైమ్ వీడియోలో జరుగుతుంది. ఇప్పుడు, నటి యొక్క మరో చిత్రం కూడా ఆన్ లైన్ విడుదల కోసం పోటీ పడుతోంది. ఈ నటి తదుపరి, మిస్ ఇండియా అమెజాన్ ప్రైమ్ వీడియోతో డైరెక్టు ఆన్ లైన్ విడుదల కోసం చర్చలు జరుపుతోందని వార్తలు వస్తున్నాయి.

ఈ చిత్రం ఏప్రిల్‌లో విడుదల కావాల్సి ఉంది కానీ కరోనా పాండమిక్ మరియు లాక్‌డౌన్ కారణంగా ఇది జరగలేదు. థియేటర్లు ఓపెన్ కావడంలో అనిశ్చితి ఉండటంతో డైరెక్టుగా ఆన్ లైన్ లోనే విడుదల చెయ్యాలని నిర్మాతలు ఆలోచిస్తున్నారు. కొత్త దర్శకుడునరేంద్రనాథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

ఈ చిత్రం ఆమె కెరీర్ లో 20 వ చిత్రం, మరియు ఇది మహిళల సమస్యల గురించి మాట్లాడే సినిమా. ఈ మహిళా సెంట్రిక్ చిత్రంలో సీనియర్ కామెడీ నటులు నరేష్, రాజేంద్ర ప్రసాద్ ముఖ్యమైన పాత్రలు పోషించారు. ‘అత్తారింటికి దారేది’ నటి నాడియా, భానుశ్రీ మెహ్రా, కమల్ కామరాజు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.