KCR-Telangana-MLA-Listతెలంగాణాలో ఉన్న 119 నియోజకవర్గాలలో 105 మందితో కూడిన జాబితాను విడుదల చేసి టికెట్ల పంపిణీ విషయంలో తన వైఖరి ఏమిటో కేసీఆర్ చెప్పకనే చెప్పారు. అలాగే మిగిలి ఉన్న నియోజకవర్గాల విషయంలోనూ ఓ స్పష్టమైన ప్రకటనను చేసిన కేసీఆర్ ఎమ్మెల్యేల జాబితాలో ఓ “స్పెషల్” పర్సన్ కూడా ఉన్నారు. గతంలో తెలంగాణా జర్నలిస్టుల ఫోరంకు జనరల్ సెక్రటరీగా ఉన్న చంటి క్రాంతికిరణ్.

సంగారెడ్డి జిల్లాలోని ఆందోల్ నియోజకవర్గానికి గానూ ఎంపిక జరిగింది.ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుండి ప్రముఖ సినీ నటుడు, కమెడియన్ అయిన బాబూమోహన్ ప్రాతినిధ్యం వహిస్తుండగా, అతనిని పక్కనపెట్టి మరీ మీడియా వ్యక్తికి కేసీఆర్ టికెట్ ఇవ్వడం గమనార్హం. అంతేకాదు బాబూమోహన్ కు టికెట్ ఇవ్వడం లేదన్న విషయం అతనికి తెలిపే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా స్వయంగా కేసీఆర్ సెలవిచ్చారు. దీంతో తొలిజాబితాలో ఉన్న 105 మందిలో క్రాంతికిరణ్ స్పెషల్ గా మారారు.