Finally, a Female in KCR's Team?దేశంలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్టుగా చెప్పబడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తెలంగాణ గవర్నమెంట్ వచ్చే బడ్జెట్ లో 20000 కోట్లు ఇవ్వనున్నట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఒక కీలక దశ పూ Team?” ర్తి చేయడానికి ఇరవై వేల కోట్ల రూపాయలు కావాలని ఇరిగేషన్ అదికారులు ఇండెంట్ పెట్టారు. ఆర్దిక శాఖకు వారు ఈ మేరకు ప్రతిపాదనలు పంపించారు.

గత బడ్జెట్ లో మొత్తం నీటిపారుదుల శాఖకు 25000 వేల కోట్లు ఇచ్చారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు మాత్రమే ఇరవై వేల కోట్లకు ప్రతిపాదనలు పంపడంతో ఆర్దిక శాఖ ఏమి చేయాలా అని తర్జనభర్జన పడుతోందట. కాళేశ్వరం ప్రాజెక్టును వచ్చే డిసెంబర్ నాటికి ఒక దశ పూర్తి చేసి నీళ్లు ఇవ్వాలని సంకల్పించారు.

కాని ముఖ్యమంత్రి కెసిఆర్ జూన్ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. అలా పూర్తి చెయ్యాలంటే నిధులు ఇవ్వడం అనివార్యం. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం అంచన 83000 కోట్లు. దేశంలోనే అత్యంత ఖరీదైన ఈ ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్ట్మాకంగా చేపడుతుంది.