KCR helps Gundu Hanumantha Rao for medical treatment-కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో గతకొంత కాలంగా బాధపడుతున్న ప్రముఖ నటుడు గుండు హన్మంతరావుకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం చేసింది. ఆయన చికిత్స నిమిత్తం 5 లక్షల రూపాయల నగదును ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి విడుదల చేసింది. ఈ విషయాన్ని ట్విట్టర్ లో వెల్లడించిన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలియజేసారు.

ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గుండు హన్మంతరావు గత కొంత కాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారానికి మూడు సార్లు డయాలసిస్ చేయించుకుంటున్నారు. చికిత్సకు అవసరమైన ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నారు.

ఈ విషయాన్నీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ద్వారా తెలుసుకుని మెగాస్టార్ చిరంజీవి రూ.2 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేసి ఆదుకున్నారు. దీనితో బయటకు వచ్చిన ఈ విషయాన్నీ అందరు కేటీఆర్ దృష్టికి తీసుకుని వచ్చారు. దానితో ఆయన స్పందించి వెంటనే సహాయం చేసారు.