2019 ఎన్నికలు సమీపిస్తుండగా ఇప్పటికే యాత్ర అనే పేరుతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్రపై ఒక సినిమా వస్తుంది. ఇప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానికి కారణమైన హెలికాప్టర్ ప్రమాదం నేపథ్యంతో తమిళంలో ఒక చిత్రం తెరకెక్కుతోంది. కోలీవుడ్ యంగ్హీరో కృష్ణ, తెలుగమ్మాయి బిందుమాధవి జంటగా నటిస్తున్న ఆ చిత్రమే ‘కళుగు2’.
కృష్ణ కెరీర్లో మైలురాయిగా చెప్పుకునే ‘కళుగు’ చిత్రానికి సీక్వెల్ ఇది. సత్యశివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి యువన్ సంగీతం, గోపికృష్ణ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. మూనార్ అటవీ ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతున్నారు. కథ విషయానికి వస్తే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయాణం చేస్తున్న హెలికాప్టర్ ప్రమాదంలో చిక్కుకుని అటవీ ప్రాంతంలో కూలిపోతుంది.
నేలకొరిగిన హెలికాప్టర్ను, ముఖ్యమంత్రిని వెతికేందుకు సైనికులు రంగంలోకి దిగుతారు. ఆ ప్రాంతం ప్రజల సహకారంతో అటవీప్రాంతం మొత్తం సైనికులు జల్లెడ పడుతుంటారు. అయితే ఆ అడవిలో వేటకుక్కలు అధికంగా ఉండడంతో వాటిని పట్టుకునే హీరో కృష్ణ సహకారం తీసుకుంటారు. ఆ తరువాత ఏం జరిగిందనేది మిగిలిన కథ