Karunanidhi-Latest-Updatesఎన్నో వివాదాల నడుమ మెరీనా బీచ్‌లో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అంత్యక్రియలు పూర్తయ్యాయి. అన్నా స్వ్కేర్‌ ప్రాంగణంలో… ప్రభుత్వ లాంఛనాలతో కరుణానిధి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కరుణ భౌతిక కాయంపై జాతీయ జెండా కప్పి సైనికులు గౌరవ వందనం సమర్పించారు.

కన్నీరు మున్నీరైనా కుటుంబ సభ్యులు అంతిమ నివాళులు సమర్పించిన అనంతరం.. కరుణానిధి పార్థీవదేహాన్ని కననం చేశారు. కరుణానిధి అంత్యక్రియల్లో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పాల్గొన్నారు. కరుణానిధిని కడసారి చూడటానికి వచ్చిన డీఎంకే శ్రేణులు, అభిమానులు కన్నీలు వీడ్కోలు పలికారు.

ఎందరో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. అంత్యక్రియల సందర్భంగా గొడవలు చెలరేగే అవకాశం ఉందని భావించినా అంతా ప్రశాంతంగా ముగిసింది. రెండేళ్ళ లోపులోనే తమిళ నాట ఇద్దరు రాజకీయ ఉద్దండులు కాలం చేశారు. దీనితో తమిళ రాజకీయాలు ఎటు వైపు నడవబోతున్నాయో చూడాలి.