CHAAVU KABURU CHALLAGAఆర్ఎక్స్ 100 తో పెద్ద హిట్ కొట్టిన కార్తికేయ ఆ తరువాత వరుస సినిమాలు చేసిన అతను సక్సెస్ ని అందుకోలేకపోయాడు. వరుస పరాజయాలతో అతనికి ఆర్ఎక్స్ 100 విజయంతో వచ్చిన ఎడ్వాంటేజ్ అంతా పోయింది. మార్కెట్ కూడా క్రమేపి తగ్గుతుండడంతో అతని పని అయిపోయింది అని అనుకున్నారు అంతా.

అయితే ఈ క్రమంలో గీత ఆర్ట్స్ గ్రూప్ లో భాగమైన జిఏ2 పిక్చర్స్ బ్యానర్ (బన్నీ వాస్ ప్రొడ్యూసర్) లో ఛాన్స్ కొట్టేశాడు కార్తికేయ. ఈ సినిమాకు ‘చావు కబురు చల్లగా’ అనే టైటిల్ ఖరారు చేసారు. ఈ సినిమాతో కౌశిక్ అనే కొత్త దర్శకుడు టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నాడు. ఒక విలక్షణమైన కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందిస్తున్నారని సమాచారం.

ఈ నెల 19 నుండి సెట్స్ మీదకు వెళ్తుంది. గతంలో నానికి భలే భలే మగాడివోయ్, విజయ్ దేవరకొండకు గీత గోవిందం, సాయి ధరమ్ తేజ్ కు ప్రతి రోజు పండగే సినిమాలతో వారి కేరీర్ బెస్టు సినిమాలు ఇచ్చింది జిఏ2 పిక్చర్స్ బ్యానర్. దీనితో సినిమా ముహూర్తం రోజే పాజిటివ్ వైబ్ తో మొదలైంది ఈ సినిమా.

ఈ చిత్రంలో కార్తికేయ బస్తి బాలరాజు పాత్రలో కనిపించబోతున్నాడు. భలే భలే మగాడివోయ్ సినిమాలో హీరోయిన్ గా నటించిన లావణ్య త్రిపాఠి ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించడం విశేషం. ఈ సినిమాలో ఆమె కూడా ఒక విభిన్నమైన గెట్ అప్ లో కనిపిస్తుందని సమాచారం. ఆమని, శ్రీకాంత్‌ అయ్యంగర్, మహేష్, భద్రం తదితరులు నటించనున్న ఈ చిత్రానికి జేక్స్‌ బిజోయ్ సమకూరుస్తున్నాడు.