కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మరోసారి తెరపైకి వచ్చారు. కాపు జాతి ప్రయోజనాలు కాపాడటానికి వారికి రేజర్వేషన్లు వర్తింప చెయ్యడానికి మరో పోరాటం చేయడానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నానని, అందుకు తగిన కమిటీ కార్యాచరణ అంతర్గతంగా సిద్ధం చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
“నాకు ఐదు కోట్ల మంది ప్రజల కంటే నా జాతి ముఖ్యం, అందుచేత నా జాతి కోసం ఎంతకైనా తెగిస్తా. నా జాతికి ఎవరైతే న్యాయం చేస్తారో వారికి మాత్రమే మా జాతి మద్దతు ఉంటుంది. వాగ్దానాలు చేసే విస్మరించిన చంద్రబాబు లాంటి ధగాకోరు నాయకులకు కాపు జాతి తగిన సమయంలో బుద్ధి చెబుతుంది,” అని ఆయన అన్నారు.
చంద్రబాబు ప్రభుత్వం తమ జాతి కోసం పోరాడే తనను ఘోరంగా అవమానించిన తమ జాతి కోసం మౌనంగా భరించానన్నారు. ఇదే సంధర్భంగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సక్సెస్ కావడం కష్టమని, ఆయన ఓ మహా వృక్షము నీడలో ఉన్నారని, ఆయన బీజేపీని వదిలి బయటకు వస్తే గాని ఎదగలేరని అన్నారు.