కాపు రేజర్వేషన్లపై నోరు జారీ ఆ తరువాత నాలుక కరుచుకున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు ఏదో రకంగా వారిని మరిపించే ప్రయత్నం సాధిస్తున్నారు. కాపుల రేజర్వేషన్లకు తాము అనుకూలమని తరువాత మాట మార్చి ఇప్పుడు కాపులకు 10000 కోట్లు ఇస్తామని ఊదరగొడుతున్నారు.
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలంలో పాదయాత్ర కొనసాగిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గురువారం కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళలతో సన్మానం చేయించుకున్నారు. వీరందరూ ఆ సామాజిక వర్గానికి సంబంధించిన పార్టీ సమర్ధకులే.
వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, పి. పద్మావతి, చిట్నీడి సత్యవతి తదితర నాయకురాళ్లు.. జగన్ను కలిసిన వారిలో ఉన్నారు. ఏదో రకంగా కాపులు తమ పట్ల చాలా సంతోషంగా ఉన్నారని ఆ పార్టీ వారు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది.