Kanna Lakshminarayana  trying to cover narendra modi mistakesఆంధ్రప్రదేశ్ లో కడప స్టీల్ ప్యాక్టరీ, తెలంగాణలో బయ్యారం స్టీల్ ప్యాక్టరీ సాధ్యం కావని కేంద్రం స్పష్టం చేసింది. సాక్షాత్తు సుప్రీమ్ కోర్టులో వేసిన అఫిడవిట్ లోనే ఇది స్పష్టం చేసింది. అయితే ఇప్పటికే బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కడప ఉక్కు ప్యాక్టరీ కి సంబందించి పీజిబిలిటి లేదని ఎక్కడా చెప్పలేదని ఆయన చెప్పుకొచ్చారు.

తెలుగుదేశం నేతలు గాలి పోగు చేసి ప్రచారం చేస్తారని, ఇప్పుడు అది మరోసారి రుజువు అయిందని ఆయన అన్నారు. బిజెపి అద్యక్షుడు అమిత్ షా కడప ఉక్కు ప్యాక్టరీ ప్రాసెస్ లో ఉందని చెప్పారని ,అయినా ఒకాయన అబద్దాలతో ప్రజలను నమ్మించాలని చూస్తున్నారని ఆయన అన్నారు.

ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటారని, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి పుట్టగతులు ఉండవని ఆయన అన్నారు. సుప్రీం కోర్టు సాక్షిగా కేంద్రం చెప్పినదాని మీద కూడా బుకాయిస్తే ప్రజలు విశ్వసిస్తారా? ఇటువంటి వ్యాఖ్యల వల్ల బీజేపీ ప్రజలలో మరింత విశ్వసనీయత కోల్పోవడం ఖాయం. అది ఎంత త్వరగా తెలుసుకుంటే వారికే అంత మంచిది.