యూనివర్సల్ హీరో కమల్ హసన్ మరియు సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ యొక్క భారతీయుడు 2 డే వన్ నుండే రకరకాల సమస్యలతో పోరాడుతుంది. క్రేన్ ప్రమాదం కారణంగా లాక్డౌన్కు ముందే సినిమా షూటింగ్ నిలిపివేయబడింది. కరోనా తరువాత ఒక ఏడాది పాటు ఆర్ధిక మందగమనం ఉండవచ్చని నిపుణులు అంటున్నారు.
దీనితో భారతీయుడు 2 నిర్మాతలు ఆలోచనలో పడ్డారు. ఈ సినిమా కోసం పెట్టిన భారీ పెట్టుబడిని తిరిగి పొందడానికి మేకర్స్ ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయాలని యోచిస్తున్నట్లు పుకార్లు ఉన్నాయి. అలాగే మొదటి పార్టు విడుదలకు ముందే రెండు పార్టీల బిజినెస్ పూర్తి చేసేయాలని వారు అనుకుంటున్నారు.
ప్రస్తుతానికి ఈ ఆలోచన పరిశీలనలో ఉంది, తుది నిర్ణయం తీసుకోవలసి ఉంది. ఇది ఇలా ఉండగా… ఈ చిత్రం కోసం ఒక నెల రోజుల విదేశీ షెడ్యూల్ కూడా ప్లాన్ చేశారు. ఇప్పుడు, కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఆ షెడ్యూల్ జరిగే అవకాశం లేదు. ఆ షెడ్యూల్ కూడా మన దేశంలోనో, లేక సెట్లు వేసో పూర్తి చెయ్యాలి. ఇది కూడా బడ్జెట్ ని పెంచుతుంది.
ఇటీవలే రాజకీయాలలోకి వచ్చిన కమల్ హస్సన్ ఇదే తన చివరి సినిమా అని ఇప్పటికే ప్రకటించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2021లో జరగబోతున్నాయి. ఒకవేళ ఈ సినిమా అప్పటికి విడుదల కాకపోతే… దీని ద్వారా వస్తుంది అనుకున్న రాజకీయ లబ్ది కూడా రాదు.