Nandamuri Kalyan Ram Controversial Comments on Heroinesపూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన “ఇజం” సినిమాకు ప్రేక్షకుల నుండి భిన్న స్పందనలు వ్యక్తమైన విషయం తెలిసిందే. అయితే పండగ సెలవులలో ప్రేక్షకులను ఉత్సాహ పరించేందుకు ‘ఇజం’ చిత్ర బృందం పూరీ జగన్నాధ్, కళ్యాణ్ రామ్ లతో కలిసి హరికృష్ణ ప్రత్యేకంగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం మీడియా ఛానల్స్ లో ప్రధానంగా ప్రసారమవుతున్నాయి.

అందులో భాగంగా హీరోయిన్ గురించి యాంకర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన కళ్యాణ్ రామ్, “అదితి ఆర్య చాలా బాగా చేసిందని, బాగా డెడికేషన్ ఉన్న హీరోయిన్ అని, ముఖ్యంగా ఇటీవల కాలంలో షాట్ అయిపోగానే, అందరికీ బాగా ఎక్కువైపోయింది కదండీ… అంతా ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటున్నారుగా… అలా కాకుండా తన డైలాగ్స్ పేజీని పట్టుకుని ప్రాక్టీస్ చేస్తుందని, నిజానికి ఒక్కసారి కూడా వాట్సప్, ఫేస్ బుక్ వాడడం ఒక్కసారి కూడా చూడలేదని” దర్శకుడు పూరీ జగన్నాధ్, కళ్యాణ్ రామ్ లు చెప్పుకొచ్చారు.

అదితి ఆర్య గురించి గొప్పగానే చెప్పుకొచ్చారు గానీ, సోషల్ మీడియాలో అత్యంత యాక్టివ్ గా ఉండే వారిలో దర్శకుడు పూరీ జగన్నాధ్ కూడా ఒకరు. దీంతో కళ్యాణ్ రామ్ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి? అన్న ప్రశ్న తలెత్తుతోంది. నిజానికి ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోయిన్లంతా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నవారే. మరి కళ్యాణ్ రామ్ కౌంటర్లు వారికి కూడా తగిలాయా? మొత్తానికి సోషల్ మీడియాపై ఈ నందమూరి హీరో కాస్త గుర్రుగానే ఉన్నారన్న విషయం స్పష్టమవుతోంది. బహుశా తన ‘ఇజం’ సినిమాకు సోషల్ మీడియాలో అంత పాజిటివ్ టాక్ లభించక పోవడమే కారణమా..?!