మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ యొక్క రెండవ చిత్రం, సూపర్ మచ్చి లాక్డౌన్ తరువాత షూటింగ్ ప్రారంభించిన టాలీవుడ్ యొక్క రెండవ చిత్రం. ఈ సినిమా చివరి షెడ్యూల్ ఈ రోజు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. ఈ చిత్ర నటి రచిత రామ్, అజయ్ కూడా షూటింగ్లో ఉన్నారు.
ప్రభుత్వ నియమ నిబంధనలను అనుసరించి, అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ షూటింగ్ జరుపుతున్నారు. ఈ షెడ్యూల్తో సినిమా మొత్తం పూర్తవుతుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు… ఈ సినిమా నిర్మాతలు తమ చిత్రాన్ని డైరెక్టుగా ఆన్ లైన్ లో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి.
కళ్యాణ్ దేవ్ 2018లో విడుదలైన ‘విజేత’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దానితో కొంత గ్యాప్ తీసుకుని తన తరువాతి ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నారు ఆయన. ఈ సినిమాతో పెద్ద హిట్ కొట్టాలని చాలా ఆశలే పెట్టుకున్నాడు ఈ యువ హీరో.
గతంలో అనేక టీవీ సీరియల్స్ కు దర్శకత్వం వహించిన పులి వాసు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి తమన్ స్వరాలు కూర్చిన ఐదు పాటలు ‘సూపర్ మచ్చి’ సినిమాకు ఎస్సెట్ కానున్నాయని నిర్మాతలు ఆశావాహం వ్యక్తం చేస్తున్నారు. రాజేంద్రప్రసాద్, నరేష్, ప్రగతి, అజయ్, పోసాని కృష్ణమురళి, ‘జబర్దస్త్’ మహేష్, భద్రం, పృథ్వీ, ఫిష్ వెంకట్ ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు.