కరోనా వైరస్ వ్యాప్తి తరువాత కెమెరాను ఎదుర్కొన్న మొదటి స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కావచ్చు. ఒక టీవీ కమర్షియల్ షూటింగ్లో నటి పాల్గొన్నట్లు సమాచారం. ఈ కమిట్ మెంట్ చాలా కాలంగా పెండింగ్లో ఉండడంతో ఆమె ఇప్పుడు దాని షూటింగ్ పూర్తి చేసిందిని వార్తలు వస్తున్నాయి.
అవసరమైన అన్ని భద్రతా చర్యలు తీసుకుంటూ ఈ నటి ఇటీవల షూట్ను పూర్తి చేసిందని వార్తలు వస్తున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, భారతదేశ కరోనా రాజధాని అయిన ముంబైలో షూటింగ్ జరిగింది. ముంబైలో 70,000 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దేశంలోని మిగతా నగరాల కంటే ఇది చాలా ఏక్కువ.
కాజల్ అగర్వాల్ చిరంజీవి తదుపరి చిత్రం ‘ఆచార్య’ కు సంతకం చేసింది కాని ఆమె ఇంకా సినిమా షూటింగ్ మొదలు పెట్టలేదు. ఖైదీ నెం 150 తర్వాత మెగాస్టార్తో ఆమె చెయ్యబోతున్న రెండవ చిత్రం ఇది. అలాగే ఆమె కమల్ హాసన్ యొక్క ‘ఇండియన్ 2’ లో హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ లో పాల్గొంది కూడా.
ఈ పాత్ర కోసం నటి కొన్ని మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుంది. తెలుగులో ఆమె మంచు విష్ణు తాజా చిత్రం ‘మోసగాళ్లు’ లో కూడా నటిస్తుంది. ఈ సినిమా జూన్ లో విడుదల కావాల్సింది. అయితే కరోనా కారణంగా వాయిదా పడింది. ఇకపోతే కాజల్ సినిమా షూటింగ్ లో ఎప్పుడు పాల్గొంటుందో చూడాలి.