కడప స్టీల్ ప్లాంట్ పై కేంద్రం దిగి వచ్చేలా కనిపించడం లేదు. దీనిగురించి కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్ మళ్ళీ పాత పాటే పడుతున్నారు. పార్లమెంట్ జరుగుతున్న సమయంలో ఎలాంటి ప్రకటన చేయలేనని ఆయన టీడీపీ ఎంపీలకు చెప్పారు. టాస్క్ఫోర్స్ ఇచ్చే నివేదికకు డెడ్లైన్ లేదని, మెకాన్ సంస్థ ఇంకా నివేదిక ఇవ్వలేదని ఆయన చెప్పారు.
రెండు రాష్ట్రాలకు సంబంధించి నివేదికలు రావాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఓ రాష్ట్రానికి సంబంధించిన ప్లాన్పై నివేదిక సాధ్యం కాదని కూడా చెప్పారు. హరియాణ, పంజాబ్ విభజన తర్వాత ఇప్పటికీ సమస్యలు ఎదుర్కొంటున్నట్లు బీరేంద్రసింగ్ పేర్కొన్నారు. కాబట్టి ఇటువంటివి సహజం అన్నట్టు ఆయన పక్కన పడేశారు
కాగా కడపలో స్టీల్ ప్లాంట్పై బీరేంద్రసింగ్కు టీడీపీ ఎంపీలు వినతిపత్రం ఇచ్చారు. గత నెలలో రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ ఉక్కు పరిశ్రమ కోసం నిరాహార దీక్ష చేసిన సంగతి తెలిసిందే. దీక్ష విరమించినా కడప స్టీల్ ప్లాంట్ వచ్చే వరకు తన గడ్డం తీయను అని ఆయన ప్రతిజ్ఞ చేశారు.