Jr NTR Trivikram mass movieయంగ్ టైగర్ ఎన్టీఆర్ చాలా కాలంగా రాజమౌళి ఆర్ఆర్ఆర్ లో స్ట్రక్ అయిపోయాడు. ఏడాది పైగానే ఆర్ఆర్ఆర్ తరువాత త్రివిక్రమ్ తో సినిమా చెయ్యబోతున్నట్టు ఎన్టీఆర్ ప్రకటించాడు. 2020 సమ్మర్ లో ఆ సినిమా పట్టాలెక్కలి. అయితే కరోనా కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అక్టోబర్ లో రిలీజ్ అవ్వబోతుంది.

రాజమౌళి ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తి కాగానే ఎన్టీఆర్ ఒక నెల బ్రేక్ తీసుకుని త్రివిక్రమ్ సినిమా మొదలుపెడతాడు. అయితే ఆ సినిమా మొదలుకాక ముందే త్రివిక్రమ్ తో మరో ప్రాజెక్టు కు పని చెయ్యబోతున్నాడు ఎన్టీఆర్. యంగ్ టైగర్ జెమిని టీవీ కోసం ఒక టీవీ షో చెయ్యబోతున్న సంగతి తెలిసిందే.

ఆ షో ప్రోమో ను త్రివిక్రమ్ డైరెక్ట్ చెయ్యబోతున్నాడని సమాచారం. త్వరలో ఈ షూటింగ్ జరగబోతుంది. గతం లో బిగ్ బాస్ హోస్ట్ గా అదరగొట్టిన ఎన్టీఆర్ చెయ్యబోయే రెండో టీవీ ప్రాజెక్ట్ ఇది. ఈ షో చేయడానికి జెమిని టీవీ తారక్‌కు భారీ పారితోషికం ఇస్తోంది. 60 ఎపిసోడ్ల పాటు జరగబోయే ఈ షోలో ప్రతి ఎపిసోడ్‌కు ఎన్టీఆర్ కు రూ .30 లక్షలు వేతనం ఇస్తున్నారు.

కాబట్టి, పూర్తిగా అతను ఈ మొత్తం షో కోసం రూ .18 కోట్లు తీసుకోబోతున్నాడు. తెలుగు బుల్లితెర మీద ఎవరైనా నటుడు అందుకుంటున్న పారితోషికం కంటే ఇది ఎన్నో రేట్లు ఎక్కువ అని విశ్లేషకులు అంటున్నారు. అయితే ఈ షో దేనికి సంబంధించి ఉండబోతుంది అనేదాని మీద అభిమానులలో ఆసక్తి పెరుగుతుంది.