Jr NTR to meet fansహరికృష్ణ మరణం తర్వాత “అరవింద సమేత” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తొలిసారిగా అభిమానుల ముందుకు వచ్చిన యంగ్ టైగర్, ఆ ఏమోషన్స్ ను తట్టుకోలేక వేదిక పైనే కన్నీటిపర్యంతం అయిన విషయం తెలిసిందే. భావోద్వేగాల నడుమ ముగిసిన ఆ వేడుక తర్వాత ‘అరవింద సమేత’ విడుదల కావడం, ప్రేక్షకుల చేత మంచి స్పందనలు తెచ్చుకోవడం జరిగిపోయాయి.

ఓవర్సీస్ లో 2 మిలియన్ మార్క్ ను దాటుకుని, జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన “నాన్నకు ప్రేమతో” (2.02 మిలియన్స్)ను దాటబోతున్న ఈ సినిమా కలెక్షన్స్ ఏపీ, తెలంగాణాలలో బాగానే ఉన్నాయి. తొలి వీకెండ్ లో వచ్చిన వసూళ్ళకు ఈ దసరా పండగ బాగానే కలిసొచ్చింది. దీంతో ఈ విజయాన్ని ప్రేక్షకులతో పంచుకునేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది.

ఈ ఆదివారం నాడు సాయంత్రం శిల్పకళావేదికలో సక్సెస్ మీట్ ను నిర్వహించబోతోంది. దీనికి సంబంధించి అధికారిక పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది. దీంతో యంగ్ టైగర్ ను ప్రత్యక్షంగా చూసుకునే మరో అవకాశం అభిమానులకు వచ్చినట్లయ్యింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భావోద్వేగాలకు గురైన జూనియర్ ఎన్టీఆర్, ఈ సక్సెస్ మీట్ లో ఏ విధంగా స్పందిస్తారోనని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.