యంగ్ టైగర్ ఎన్టీయార్, మెగాపవర్స్టార్ రామ్చరణ్ తేజ్ కాంబినేషన్లో దర్శక ధీరుడు రాజమౌళి ఓ భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా పేరు పెట్టని ఆ సినిమాని ఆర్ఆర్ఆర్ – రాజమౌళి, రామారావు, రామ్ చరణ్ అంటున్నారు. దాదాపు 300 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాత. ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన ఒక ఫైట్ ను రామ్ చరణ్ మీద హైదరాబాద్ లో తీస్తున్నారు. ఎన్టీఆర్ ఈ షెడ్యూల్ లో పాల్గొనలేదు.
వివరాల్లోకి వెళ్తే ఈ సినిమాలో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉందట. ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ బలమైన దేహలు కలిగి ఉంటారని సమాచారం. రామ్ చరణ్ దీని కోసం ఇప్పటికే కొంత రెడీ గా ఉండగా… ఎన్టీఆర్ ఇప్పుడు తన ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ తో కలిసి ఇప్పటికే దీని మీద వర్క్ చేస్తున్నారు. గతంలో వీరిద్దరూ అరవింద సమేతకు కలిసి పనిచేసారు. అరవింద సమేత సినిమా తరువాత ఎన్టీఆర్ ఇప్పటిదాకా 20 కిలోల బరువు తగ్గారట. ఇప్పటి వరకు కొత్త గెట్ అప్ పని సగం పూర్తయ్యింది.
ఏప్రిల్ నాటికి పూర్తి చేసి ఆ ఫైట్ చిత్రీకరించాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఎన్టీఆర్ ప్రస్తుతం తన కుటుంబంతో దుబాయ్ వెళ్ళారు. తిరిగి వచ్చాకా ట్రైనింగ్ మళ్ళీ షురూ చేస్తారట. వచ్చే సంవత్సరంలో ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ తప్ప మిగతా నటులు ఎవరి గురించీ టీమ్ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. తమిళ యాక్టర్ – దర్శకుడు సముద్రఖని ఈ చిత్రంలో ఒక ప్రధానమైన క్యారెక్టర్ చేస్తునట్టు ఆయనే ప్రకటించారు.