‘రంగస్థలం, భరత్ అనే నేను’ సినిమాలు విజయవంతం అయిన సమయంలో మహేష్ – చెర్రీ – ఎన్టీఆర్ లు చాలా విరివిగా కలుసుకున్నారు. ఒకరి ఫంక్షన్లకు ఒకరు వెళ్ళడం… ఒకరి సక్సెస్ లను మరొకరు సెలబ్రేట్ చేసుకోవడం… ఇలా ఎక్కడ చూసినా ఈ ముగ్గురి హీరోల కలయికకు సంబంధించిన పిక్ లే సందడి చేసాయి. దీంతో ఈ ముగ్గురు కాంబోలో ఓ సినిమా రెడీ అవుతోందన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.
ఇపుడు ఇదే ప్రశ్న ‘యంగ్ టైగర్’కు ఎదురైంది. దానికి “మహేష్ – రామ్ చరణ్ – నేను కలిసి సినిమా చేయడానికి ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు లేవు గానీ, మా ముగ్గురిని హ్యాండిల్ చేయగల దర్శకుడు ఉండాలి కదా?!” అంటూ సినీ ప్రేక్షకులు ఎదురుచూసిన ప్రశ్నకు జవాబిచ్చారు. ‘ముందుగానే ప్లాన్ చేసుకుని సినిమాలు చేయలేం, ఒకవేళ అలాచేస్తే ఏమవుతుందో నాకు వ్యక్తిగత అనుభవం ఉందంటూ’ ఓ పంచ్ తనపైన తానే వేసుకున్నాడు.
బహుశా రికార్డులు కొట్టేయాలని ప్లాన్ చేసిన సినిమా, బాక్సాఫీస్ వద్ద చతికిలపడిన అనుభవమో ఏమో గానీ, తారక్ మాత్రం వాటిని లైట్ గా తీసుకుంటూ, ప్రస్తుతం అంతా వేదాంత ధోరణిలో మాట్లాడుతున్నాడు. ‘ఓ మనిషి జీవితంలో మహిళ పాత్ర ఎంత ముఖ్యమో’ మా ‘అరవింద సమేత’ ద్వారా చెప్పామని, ‘యుద్ధం చేసే సత్తా లేని వాడికి శాంతి అడిగే హక్కు లేదు’ అన్నదే ఈ సినిమాలో హీరో పాటించే థీమ్ గా వెల్లడించారు యంగ్ టైగర్.