JR NTR Kalyan Ram NTR Ghatప్రతి ఏడాది ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ ట్యాంక్ బండ్ మీద ఉన్న ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించి వారి తాత గారికి నివాళులర్పించడం ఒక సంప్రదాయం. కానీ వారు దానిని రేపు తప్పించనున్నారు. “ప్రజల భద్రత దృష్ట్యా, ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ రేపు ఎన్టీఆర్ ఘాట్ను సందర్శించరు” అని ఆ నటుల పీఆర్వో వెల్లడించారు.

“వారు స్వార్గీయ నందమూరి తార రామరావు గారికు ఇంట్లో నివాళులు అర్పించనున్నారు. ప్రభుత్వ కోవిడ్ 19 లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధమైన జనసమూహాన్ని నివారించడం కోసం వారు ఈ నిర్ణయం తీసుకున్నారు” అని వారు తెలిపారు. వారి నివాళుల చిత్రాలను రేపు విడుదల చేయాలని భావిస్తున్నారు.

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రతి ఏడాది అట్టహాసంగా జరిగే మహానాడు ఈ ఏడాది ఆన్ లైన్ లో జూమ్ యాప్ లో జరుగుతుంది. ఇక పోతే… ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వం వహించిన రామ్ చరణ్ తో ఆర్ఆర్ఆర్ అనే మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తున్నారు.

కళ్యాణ్ రామ్ సంక్రాంతికి విడుదలైన ఎంత మంచివాడవురా తో అపజయాన్ని ఎదుర్కొన్నాడు. ఆయన తన తదుపరి చిత్రాన్ని ఇంకా ప్రకటించలేదు. సిజిలో ఎక్కువగా ఉండే రావణ్ అనే చిత్రంలో ఆయన నటించనున్నట్లు పుకార్లు ఉన్నాయి. ఆ సినిమా కోసం జిమ్ కు వెళ్లి కండలు పెంచుతున్నాడు కళ్యాణ్ రామ్.