Jr NTR -Tarak2018 అక్టోబర్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చివరి సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. రాజమౌళి పుణ్యమా అంటూ హీరో ని పెద్ద తెర మీద చూసి అప్పుడే రెండేళ్లకు పైగా అయిపోయింది అభిమానులు. ఆర్ఆర్ఆర్ వచ్చే ఏడాది సంక్రాంతికి గానీ విడుదల కాదు అంటున్నారు అంటే అప్పటికి దాదాపుగా మూడున్నరేళ్లు.

అయితే అంత కాలం ఆగలేం అనుకున్నారో ఏమో తారక్ అభిమానులు తమ అభిమాన హీరో సినిమాల స్పెషల్ షోలు వేయించుకుంటున్నారు అది కూడా థియేటర్లలో. మొన్న ఆ మధ్య హైదరాబాద్ లోని ప్రసాద్స్ లో టెంపర్ స్పెషల్ షో వేయించుకుని ఫ్యాన్స్ స్పెషల్ గా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు లాక్ డౌన్ తరువాత మరో స్పెషల్ షో ప్లాన్ చేస్తున్నారు.

ఈ నెల 22న సాయంత్రం ఏడు గంటలకు అదే ప్రసాద్స్ లో జై లవ కుశ స్పెషల్ షో వేయించుకుంటున్నారు తారక్ అభిమానులు. షో వేయించుకోవడమే కాదు హౌస్ ఫుల్ చేస్తాం అని కూడా అంటున్నారు వారు. హీరోని మిస్ అవుతున్న అభిమానులు ఏకంగా మల్టీప్లెక్స్ లో స్పెషల్ షోలు వేయించుకోవడం బహుశా ఎన్టీఆర్ అభిమానులకే చెల్లింది.

మరోవైపు… మార్చి, ఏప్రిల్ నాటికైనా ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తి అయితే ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా మొదలుపెడదామని ఆలోచిస్తున్నాడు. ఒకవేళ ఆర్ఆర్ఆర్ వచ్చే ఏడాది సంక్రాంతి కాకుండా వేరే డేట్ కి వస్తే… ఆ సినిమా సంక్రాంతికి వేసే అవకాశం ఉంది. అయితే రాజమౌళి సినిమా తో ముడిపడి ఉంది కాబట్టి త్రివిక్రమ్ సినిమా భవిష్యత్తు కూడా ఇప్పట్లో తేలే అవకాశం లేదు.