jr ntr evaru meelo koteswarulu showప్రస్తుతం టెలివిజన్ లో టాలీవుడ్ స్టార్స్ హోస్ట్ చేస్తున్న క్రేజీ షో లలో ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ ఒకటి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయడంతో ఈ షో కి కాస్త బజ్ వచ్చింది. ముఖ్యంగా తారక్ కోసం చాలా మంది సెలెబ్స్ కూడా ఈ షోకి వచ్చారు. తాజా సమాచారం మేరకు ఈ షో ఫస్ట్ సీజన్ పూర్తవుతుందట. ఇటివలే లాస్ట్ ఎపిసోడ్ కి సంబంధించి షూట్ ఫినిష్ చేసెసాడట తారక్. నవంబర్ మొదటి వారంతో సీజన్ కి ఎండ్ కార్డు పడనుందట.

అయితే సెకండ్ సీజన్ కి కూడా తారక్ నే హోస్ట్ గా ఉండమని రిక్వెస్ట్ చేశారట. కావాలంటే రెమ్యునరేషన్ కూడా పెంచుతామని చెప్పారట. కానీ దానికి తారక్ ఒప్పుకోలేదని, స్మూత్ గా నో చెప్పేసి ఫస్ట్ సీజన్ తో పక్కకి తప్పుకున్నాడని ఇన్సైడ్ టాక్. ఎన్టీఆర్ నో చెప్పడానికి ఓ స్ట్రాంగ్ రీజన్ కూడా ఉంది. మాటీవీలో నాగ్ హోస్ట్ గా వచ్చిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ మంచి రేటింగ్ రాబట్టింది. తర్వాత సెకండ్ సీజన్ లో మెగా స్టార్ చిరు హోస్ట్ గా చేయడంతో దానికి బజ్ వచ్చినా తక్కువ రేటింగ్ తో ఫ్లాప్ షో అనిపించుకుంది. దాంతో మా ఆ షో ని వదిలించేసుకొని చేతులు దులిపేసుకుంది. ఇప్పుడు అదే షో పేరు మార్పుతో జెమినీలో టెలికాస్ట్ అవుతున్న ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ కి మినిమమ్ రేటింగ్ కూడా రావట్లేదు. దానికి కారణం జెమినీ టివీ కి తక్కువ వ్యూవర్ షిప్ ఉండటమే.ప్రస్తుతం జెమినీ.. మా టివీ , జీ టివీ , ఈటీవీ ల తర్వాత నాలుగో స్థానం ఉంది.

తారక్ ఈ షో ఒప్పుకున్నప్పుడు రికార్డు స్తాయిలో రేటింగ్ వస్తుందని ఊహించాడు. కానీ తీరా చూస్తే ప్రతీ వారం ఊహించని విధంగా తక్కువ రేటింగ్ తో షాకయ్యాడట. అలాగే బయటి నుండి కూడా తారక్ కి బ్యాడ్ ఫీడ్ బ్యాక్ వచ్చిందట. జెమినీ లో షో చేయడం రాంగ్ ఛాయిస్ అంటూ పెర్సనల్ గా చెప్తున్నారట. అందుకే అధిక రెమ్యునరేషన్ ని తిరస్కరించి మరీ కూల్ గా డేట్స్ లేవంటూ సీజన్ 2 నుండి పక్కకి తప్పుకున్నాడని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతో ?