Many-Other-Vs-Jr-NTR's-Aravinda-Sametha---This-Dussehraఆగష్టు 15వ తేదీన ఉదయం 9 గంటలకు విడుదల కాబోయే “అరవింద సమేత” ఫస్ట్ టీజర్ కోసం యంగ్ టైగర్ అభిమానులు నిరీక్షిస్తున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని ఓ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ స్పష్టం చేయగా, ఇప్పుడు అదే తారక్ ఫ్యాన్స్ ను కలవరపెడుతోంది.

‘అజ్ఞాతవాసి’ సినిమా ఫస్ట్ టీజర్ లో ఓ కుర్చీని పట్టుకుని పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ బాగా పాపులర్ అయ్యింది గానీ, ఆ తర్వాత సినిమా అంతకుమించిన అన్ పాపులర్ అయ్యింది. ఇప్పుడు ‘అరవింద సమేత’ పోస్టర్ లో జూనియర్ ఎన్టీఆర్ కుర్చీలో కూర్చుని ఉండడం యంగ్ టైగర్ ఫ్యాన్స్ ను టెన్షన్ పెట్టే అంశంగా మారింది.

‘జై లవకుశ’ సినిమా కమర్షియల్ గా అనుకున్న సక్సెస్ కాకపోవడంతో, తారక్ అభిమానులంతా ఈ “అరవింద సమేత” పైనే పెట్టుకున్నారు. అందులోనూ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో మొదటిసారిగా వస్తున్న సినిమా కావడం మార్కెట్ వర్గాల్లోనూ ఈ సినిమా హాట్ టాపిక్ గా మారింది.