సచీ దర్శకత్వంలో రూపొందిన `అయ్యప్పనుమ్ కోషియుమ్` మలయాళంలో సంచలన విజయం సాధించింది. ఇందులో పృథ్వీరాజ్, బీజు మీనన్ కీలక పాత్రల్లో నటించారు. యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్ హీరోగా నటించాడు. థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రం రాజీపడని ఇద్దరు అహంభావం గల వ్యక్తుల జీవితాల నేపథ్యంలో తెరకెక్కింది.
ఈ చిత్ర తెలుగు రీమేక్ రైట్స్ని సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవరనాగవంశీ దక్కించుకున్నారని ఇప్పటికే తెలిసిందే. ఈ సినిమాలో ఒక హీరో పాత్రకు నందమూరి బాలకృష్ణని, మరో హీరో పాత్ర కోసం రానాని అనుకుంటున్నట్టు మొన్న ఆ మధ్య వార్తలు వచ్చాయి.
తమిళంలో కూడా ఈ సినిమాను రీమేక్ చెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మరో పక్క బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్నాడు. తన జెఏ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించబోతున్నాడు. తొందరలో ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుంది.
ఇద్దరు హీరోలలో ఒక పాత్రలో జాన్ అబ్రహ్మాం చెయ్యనున్నారు. ఇది పక్కా విల్లెజ్ బ్యాక్ డ్రాప్ లో తీసిన సినిమా. కొంతమేర రాజకీయనేపథ్యం కూడా ఉంటుంది. ఈ సినిమా బాలీవుడ్ నేటివిటీకి సరిపోయేలా ఎలా మార్పులు చేస్తారు అనేది చూడాలి. ఆ మార్పుల మీదే సినిమా భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.