ఒకప్పుడు తెలుగు సినిమా హీరోయిన్ల గమనాన్ని మార్చిన బ్యూటీగా శ్రీదేవి పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. అప్పటివరకు సంప్రదాయ దుస్తులలో కనువిందు చేసే తారామణులు, శ్రీదేవి ఎంట్రీతో వెస్ట్రన్ కాస్ట్యూమ్స్ పోకడ ఎక్కువైంది. తొడలు కనిపించేలా నటించాలంటే శ్రీదేవిని, తొడలు కప్పుకుని నటించాలంటే జయప్రదను ఎంపిక చేసుకునే వారమని ప్రముఖ దర్శకురాలు, నటీమణి విజయనిర్మల ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేసారు. అంతలా దర్శకనిర్మాతలను శ్రీదేవి తన అందాలతో ప్రభావితం చేసేది.
అయితే ఎంతగా అందాల ప్రదర్శన చేసినప్పటికీ, శ్రీదేవి అభినయం కూడా అత్యుత్తమ స్థాయిలోనే ఉండేది. ఆ కాలంలో ఎంతటి సంచలనం సృష్టించిందో, ఈ కాలంలో ఆమె తనయురాలు జాహ్నవి కూడా ఆ స్థాయిలో సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతోంది. అందాల ప్రదర్శన చేసే బికినీ ఫోటోలకు, కిక్ ఇచ్చేటటువంటి ఫోజులకు కొదవే లేకపోగా, తాజాగా కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడితో ఉన్నటువంటి ఫోటోలు సామాజిక మాధ్యమాలలో హల్చల్ చేస్తున్నాయి.
జాహ్నవి బాయ్ ఫ్రెండ్ గా బాలీవుడ్ వర్గాలు పరిగణిస్తున్న శిఖర్ పహారియాతో లిప్ లాక్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో మరోసారి రచ్చకు కారణమైంది. ప్రస్తుతం న్యూయార్క్ లో నటనలో శిక్షణ పొందుతున్నదని ప్రచారం జరుగుతుండగా, ఈ ఫోటోలు ఎప్పుడు, ఎక్కడివో మాత్రం ఖచ్చితమైన సమాచారం లేదు. అయితే ఇంతగా జాహ్నవి పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగుతున్నా, శ్రీదేవి – బోనీ కపూర్లు మాత్రం పెదవి విప్పకపోవడం విశేషం. తెలుగులో శ్రీదేవికున్న క్రేజ్ రీత్యా, ఆమె కూతురు చేస్తున్న పనులు చూసి ముక్కున వేలేసుకోవడం తెలుగు సినీ అభిమానుల వంతవుతోంది.