Jeevitha, Rajasekhar Joining TDPప్రస్తుతం ‘గరుడ వేగ’ సినిమా హిట్ తో మంచి జోష్ మీదున్న జీవిత, రాజశేఖర్ లు మళ్లీ రాజకీయ ప్రవేశానికి సిద్ధమవుతున్నారని సమాచారం. ఇప్పటికే పలు పార్టీలలో పనిచేసిన ఈ ఇద్దరూ… మళ్లీ టీడీపీలోకి వస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై జీవిత ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా మీరు టీడీపీలోకి చేరనున్నారా అంటూ ఆమెను ప్రశ్నిస్తే… చేరమంటే, చేరుతానంటూ ఆమె సరదాగా వ్యాఖ్యానించారు.

మరోవైపు వీరిని పార్టీలోకి చేర్చుకోవడానికి టీడీపీ కూడా సిద్ధంగానే ఉన్నట్టు సమాచారం. మొదట్లో జీవిత, రాజశేఖర్ లు టీడీపీ సానుభూతిపరులుగానే ఉన్నారు. ఆ తర్వాత 2009లో కాంగ్రెస్ లో చేరారు. రాజశేఖర్ రెడ్డి మరణానంతరం జగన్ స్థాపించిన వైసీపీలో చేరారు. ఆ తర్వాత వైసీపీకి గుడ్ బై చెప్పి, బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రతిఫలంగా జీవితకు సెన్సార్ బోర్డు పదవి దక్కింది. ఆ తర్వాత వీరు యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉన్నారు. తాజాగా మళ్లీ సొంత పార్టీ అయిన టీడీపీలో చేరేందుకు వీరు మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది.