మాజీ సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ ఇటీవలే జనసేన పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పూర్తి జీవితం ప్రజాసేవకే అంకితం చేస్తూ.. సినిమాల్లో ఇక నటించబోనని చెప్పిన పవన్ మాటమార్చారని లక్ష్మీనారాయణ ఆరోపించారు. మళ్లీ సినిమాల్లో నటించాలని పవన్ తీసుకున్ననిర్ణయం ఆయన లోని నిలకడ లేని విధి విధానాలను సూచిస్తుందని లక్ష్మీనారాయణ లేఖలో విమర్శించారు.
అయితే లక్ష్మీనారాయణ తరువాతి అడుగు ఎటు ఉంటుందని అంతా చర్చించుకుంటున్న తరుణంలో తాను రైతుల సేవలోకి వెళ్తున్నా అని ఆయన చెప్పారు. పార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ ను ఆయన తెలిపారు. ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తా. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తా అన్నారు.
ప్రజలు, రైతు సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తా. నేను ప్రజా సేవ చేస్తూనే ఉంటా. ప్రజా సేవకు అత్యుత్తమ వేదిక రాజకీయమే అని ఆయన అన్నారు. వ్యవసాయం, మేకిన్ ఇండియా, విద్యకు సహా పలు రంగాలకు బడ్జెట్లో కేటాయింపులు బాగున్నాయి. దేశ ఇంటర్నల్ కెపాసిటీ, ఆర్థిక పరిస్థితి పటిష్ట పరిచేందుకు చర్యలు తీసుకున్నారు.
కేంద్ర బడ్జెట్ ప్రజాహితంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఆయన బీజేపీ వైపు వెళ్లేందుకు సుగుమంగా ఉన్నట్టు అనిపించినా ప్రస్తుతానికి ఆయన కొంత కాలం ఏ రాజకీయ పార్టీలోనూ చేరే అవకాశం లేదని అర్ధం అవుతుంది. అయితే జనసేనతో విభేదించి, జనసేన పార్టనర్ తో కలవడం ఎంత వరకూ సాధ్యపడుతుందో చూడాలి.