ప్రస్తుతం టాలీవుడ్ లో జూ.ఎన్టీఆర్ హవా స్పష్టంగా కనబడుతోంది. సుకుమార్ దర్శకత్వంలో జూనియర్ చేసిన ‘నాన్నకు ప్రేమతో’ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో నందమూరి అభిమానులంతా ఎన్టీఆర్ పై దృష్టి పెట్టారు. ఎన్టీఆర్ కూడా తనపై అభిమానం చూపుతున్న అభిమానుల పట్ల గౌరవం, భాద్యతా రెండూ . ప్రదర్శించాడు. దీంతో అతని ఛరీష్మా అనూహ్యంగా పెరిగిపోయింది. ఎంతలా అంటే రజనీకాంత్ సినిమాతో సమానంగా ఎన్టీఆర్ సినిమాను అంచనా వేసేంతగా పెరిగిపోయింది.
ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం తాలూకు ట్రైలర్లు, ఆడియో బాగుండటంతో ఒక్క తెలుగు రాష్ట్రాలు, ఇండియాలోనే కాక దేశవిదేశాల్లో ఉన్న నందమూరి అభిమానాలు, ఇతర తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు. అభిమానుల్లో ఈ సినిమాపై ఉన్న ఆసక్తిని గమనించిన జపాన్ లో తెలుగు వారు ఎక్కువగా పనిచేస్తున్న ఓ కంపెనీ సినిమా విడుదల రోజు సెలవు ప్రకటించేసింది. అంతేగాక ఉద్యోగులకు ఫ్రీ మూవీ టికెట్లు కూడా అందించనుంది. ఉద్యోగుల నుండి సామూహిక సెలవులు, కాల్స్ డైవర్షన్స్, వర్క్ పెండింగ్ వంటివి జరగకుండా ఉండేందుకు సదరు కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సీన్ గతంలో రజనీ ‘కబాలి’ చిత్రం విడుదల సందర్బంగా కనబడగా మళ్ళీ ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాకు అది రిపీటైంది.