యంగ్ టైగర్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘జనతా గ్యారేజ్’ ఆడియో వేడుకకు సర్వం సిద్ధమవుతోంది. దీనిని పురస్కరించుకుని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ రోజుకో పోస్టర్ ని విడుదల చేస్తూ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ఆ క్రమంలోనే “జనతా గ్యారేజ్”కు సంబంధించి తాజాగా ఓ పోస్టర్ ని విడుదల చేసింది.
సమంత వెనుక జూనియర్ ఎన్టీఆర్…. జూనియర్ ఎన్టీఆర్ వెనుక నిత్యా మీనన్ పరిగెడుతున్న ఈ పోస్టర్ ఉద్దేశం… బ్లాక్ బాస్టర్ అందుకోవడానికి రెట్టించిన ఉత్సాహంతో ఈ ముగ్గురూ పరుగులు పెడుతున్నట్లుగా ఉందని అభిమానులు కీర్తిస్తున్నారు. ఇటీవల కేరళలో చిత్రీకరణ జరిపిన పాట సందర్భంలోనిది ఈ స్టిల్. ఇప్పటివరకు మాస్ ని ఆకట్టుకునే పోస్టర్స్ ని మాత్రమే విడుదల చేసిన చిత్ర యూనిట్, ఈ పోస్టర్ తో క్లాస్ ని కూడా ఆకర్షించే పనిలో పడింది.