ఓపెనింగ్స్ లో దుమ్ము దులిపిన “జనతా గ్యారేజ్” మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుందని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తాజాగా ఓ పోస్టర్ ను విడుదల చేసింది. మొదటి వారంలో దాదాపు 60 కోట్ల పై బడి షేర్ అందుకున్న “జనతా గ్యారేజ్” సినిమా గ్రాస్ కలెక్షన్స్ ఏకంగా 100 కోట్లు దాటాయన్నది ఈ పోస్టర్ సారాంశం. అతి తక్కువ వ్యవధిలో ఈ 100 కోట్ల మార్క్ ను అందుకున్న రెండవ సినిమాగా ‘జనతా గ్యారేజ్’ నిలిచిందని చిత్ర నిర్మాణ సంస్థ చెప్పకనే చెప్పింది. మొదటి స్థానంలో ‘బాహుబలి’ సింహాసనంపై దర్జాగా కూర్చుంది.
మైత్రీ మూవీ మేకర్స్ తాజా పోస్టర్ తో యంగ్ టైగర్ అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. దాదాపు ఒక పుష్కర కాలం తర్వాత తమ హీరో సినిమా రికార్డుల గురించి మాట్లాడే అవకాశం రావడంతో… దానిని సద్వినియోగం చేసుకునే క్రమంలో సందడి ఉంటోంది. అయితే తొలి వారం తర్వాత కలెక్షన్స్ బాగా నెమ్మదించాయని, దీనికి తోడు నేడు ‘ఇంకొక్కడు,’ రేపు ‘జ్యో అచ్యుతానంద’ సినిమాలు క్యూలో ఉండడంతో చాలా ధియేటర్లలో ‘జనతా గ్యారేజ్’ స్థానాన్ని సదరు రెండు సినిమాలు భర్తీ చేస్తుండడంతో… రెండవ వారం కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయనే దానిపైనే “జనతా గ్యారేజ్” స్థానం ఎక్కడ అనేది డిసైడ్ అవుతుంది.