Janasena to contest 175 Assembly Segments2019 ఎన్నికలకు గాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. మొన్నటిదాకా తాము ఏవో కొన్ని స్థానాలలో మాత్రమే పోటీ చేస్తామని చెప్పిన పవన్ కళ్యాణ్ తాజాగా తాము ఏపీలో 175 స్థానాల్లోనూ తాము పోటీకి సిద్ధమని ఆయన ప్రకటించారు. హైదరాబాద్‌లో మంగళవారం జరిగిన 13 జిల్లాల ప్రతినిధుల సమావేశంలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికలపై కీలక ప్రకటన చేశారు.

అనుభవం లేదని ఎవరైనా అంటే దాన్ని తిప్పికొట్టాలన్నారు. పోటీ చేయలేకపోవచ్చు.. కానీ రెండు సంస్థాగత ఎన్నికల్లో పని చేసిన అనుభవం ఉందన్నారు. సగటు మనిషి.. అణగారిన వర్గాల గొంతుకగా జనసేన ఉండాలని కార్యకర్తలకు పవన్ సూచించారు. ఇప్పటినుండే అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో ఉన్నారంట జనసేనాని.

తొందర్లో ఆ పని పూర్తి చేసి అభ్యర్థులకు నియోజకవర్గాలలో పని చేసుకోవడానికి తగిన టైం ఇవ్వాలని పవన్ అభిప్రాయమట. అదే సమయంలో ఆగస్టు రెండో వారంలో తెలంగాణలో పోటీపై ప్రణాళిక ప్రకటిస్తామన్నారు. పవన్ కళ్యాణ్ మొత్తానికి దీనిపై ఒక ప్రకటన చెయ్యడంతో జనసేన పోటీ తో ఎవరికీ లాభం ఎవరికీ నష్టం అనేది బేరీజు వేసుకునే పనిలో ఉన్నాయి మిగతా పార్టీలు.