జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వడదెబ్బ కారణంగా అనారోగ్యం పాలయ్యి విజయవాడలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. గత రెండు రోజులుగా ఆయన ప్రచారంకు దూరంగా ఉంటున్నారు. బాగా ప్రధమైన సభలకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం రామ్ చరణ్ ఆయన నివాసానికి వెళ్లి చూసి వచ్చారు. ఈ విషయాన్ని చరణ్ ఫేస్బుక్ ద్వారా వెల్లడిస్తూ పవన్ను వైద్యుడు చెకప్ చేస్తున్న ఫొటోను పోస్ట్ చేశారు. ఆ ఫొటోలో పవన్ కళ్యాణ్ చాలా నీరసంగా కనిపించారు. ఆ ఫోటో చూసి మెగా అభిమానుల గుండె తరుక్కుపోతుంది.
‘నేనెంతో ఇష్టపడే జనసేన అధినేత పవన్ కల్యాణ్ను కలిశాను. ఆయన చాలా నీరసంగా ఉన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు కొంత విరామం ఇచ్చి బాగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. కానీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈరోజు అనకాపల్లి, పెందుర్తిలో ప్రచారానికి వెళ్తున్నారు. ప్రచారంలో వైద్యులు కూడా ఆయన వెంటే ఉంటానని అన్నారు. కానీ బాబాయ్ అందుకు ఒప్పుకోలేదు. ఆయన త్వరగా కోలుకోవాలని, ప్రజలకు సేవ చేయడంలో విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు.
అయితే ఈ పరిణామాన్ని విశ్లేషకులు రెండు విధాలుగా అంచనా వేస్తున్నారు. కీలకమైన చివరి రోజులలో పవన్ కు ఇలా అవ్వడం వల్ల జనసేన ప్రచారంలో బాగా వెనుక బడింది. ఆ పార్టీకి పవన్ కల్యాణే స్టార్ కాంపైనర్ కావడంతో శ్రేణులు నీరసించిపోయాయి. అయితే కొందరు మాత్రం పవన్ కళ్యాణ్ ఫోటోల వల్ల సింపతీ వచ్చి ఎన్నికలలో అది సహాయపడవచ్చని అనుకుంటున్నారు. దీని కారణంగా శ్రేణులు మరింత కష్టపడి పని చేస్తాయని వారు భావిస్తున్నారు.