jana-sena-pawan-kalyan-tdpజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవలే టీడీపీ మీద తిరగబడ్డారు. చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ ని టార్గెట్ చేస్తూ తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసారు. రుజువులు అడిగితే అందరికి తెలిసిందే కదా రుజువులు ఎందుకు అని ఒకసారి, రసీదులు తీసుకుని లంచాలు తీసుకుంటారా అని ఎదురు ప్రశ్నించారు కూడా.

అయితే తాజాగా ఇలాంటి అనుభవమే పవన్ కళ్యాణ్ కు ఎదురయ్యింది. ఇండస్ట్రీలో మహిళల మీద జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి ఒక మీడియా ఛానల్ లో జరుగుతున్న చర్చలో ఒక జూనియర్ ఆర్టిస్టు పవన్ కళ్యాణ్ మీద తీవ్ర ఆరోపణలు చేసింది. పవన్ కళ్యాణ్ కు మసాజ్ చెయ్యడానికి బెంగాలీ అమ్మాయిలు కావాలంటారని మహిళలు ఎవరు ఆయనకు ఓటు వెయ్యొద్దని ఒక ఆమె అంది.

ఇది టీడీపీ అభిమానుల చేతిలో పాశుపతాస్త్రం అయ్యింది. లోకేష్ మీద బురద చల్లి సాక్ష్యం లేదన్నాడు,ఇప్పుడు ఈ మహిళ జనసేనాని మీద చేసిన ఆరోపణలకు కూడా సాక్ష్యాలు అవసరం లేదు, ఏమంటారు? అని పవన్ కళ్యాణ్ అభిమానులను ఎద్దేవా చేస్తున్నారు. మూడు పెళ్లిళ్లు చేసుకున్న పవన్ కళ్యాణ్ బుద్ది గురించి అందరికి తెలిసిందే గా అని అవహేళన చేస్తున్నారు.

“లంచాలు తీసుకొన్న వాళ్ళు రసీదులు ఇస్తారా?” అన్నారు సరే అలాగే “మసాజులు చేయించుకునే వాళ్లు వీడియోలు తీయించుకంటారా?” అని వారిని ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. లోకేష్ రేపు ఒక బహిరంగ సభ పెట్టి, “ఏమండోయ్,మీకు మసాజ్ కి బెంగాలీ అమ్మాయిలు కావాలని,అని ఒక మహిళ అంటుంటే విన్నాను” అంటే మీకు ఎలా అనిపిస్తుంది,సేనాని గారు? అని ప్రశ్నిస్తున్నారు.