‘జనసేన’ పార్టీని పెట్టిన తరువాత తన అభిప్రాయాలను పంచుకోవడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. శుభాకాంక్ష‌లు తెల‌పాల‌న్నా, ఏ విషయాన్నయినా విమ‌ర్శించాల‌న్నా, ఉద్య‌మానికి పిలుపునివ్వాల‌న్నా అందుకు ట్విట్ట‌రే వేదిక అవుతోంది. అలా ముందుగా సోషల్ మీడియాలో బలాన్ని పెంచుకుంటూ తాజాగా ఆ సంఖ్యను రెండు మిలియన్లకు చేర్చారు.

ప‌వ‌న్ తో పాటు పార్టీని కూడా సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంచుతున్నారు పవన్. అయితే నేరుగా స్పందించ‌కుండా ట్విట్ట‌ర్ ద్వారా మాత్ర‌మే స్పందిస్తున్నారంటూ పవన్ పై విమ‌ర్శ‌లు చేసిన వారూ లేక‌పోలేరు. ట్విట్టర్ లో స్పందించే క్రమంలో చేసిన ట్వీట్లలో ఎన్నో అక్షర దోషాలు కనిపిస్తున్నాయని కూడా విమర్శలు వెల్లువెత్తిన సందర్భాలున్నాయి. ఏది ఏమైనా ట్విట్టర్ ద్వారా జనసేన బలాన్ని అయితే పెంచుతున్నారు పవర్ స్టార్.