Jana-Sena-Pawan-Kalyanజనసేన అధినేత పవన్ కళ్యాణ్ కామన్ వెల్త్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన వెంకట్ రాహుల్ కు 10 లక్షల సహాయం ప్రకటించారు. ఇప్పుడు తాజాగా ఆయన దివ్యాంగుల టీ ట్వంటీ క్రికెట్‌కు 5 లక్షలు ప్రకటించారు. బోర్డ్ ఆఫ్ డిజేబుల్డ్ క్రికెట్ అసోసియేషన్ (బీడీసీఏ) సభ్యులు, దివ్యాంగులైన క్రికెట్ క్రీడాకారులు ఈ రోజు హైదరాబాద్ జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్‌ను కలిశారు.

వాళ్లు పడుతున్న కష్టాన్ని విని చలించిపోయిన పవన్ కల్యాణ్ 5 లక్షల సాయాన్ని ఆ దివ్యాంగుల క్రికెటర్లకు అందజేశారు. “వైకల్యం అనేది ప్రతిభకు ఏ మాత్రం అడ్డంకి కాదు, దీన్ని వీరు నిరూపిస్తున్నా. ఆత్మస్ధైర్యంతో క్రీడల్లో పాల్గొనడం దివ్యాంగులందరికీ వీళ్ళు స్ఫూర్తిగా నిలుస్తున్నారు,” అని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా అన్నారు.

మరోవైపు ఈ నెల 14 నుంచి 18 వరకూ హైదరాబాద్‌లో దివ్యాంగుల రెండో జాతీయ క్రికెట్ టోర్నమెంట్ జరగనుంది. ఈ పోటీల్లో 24 రాష్ట్రాలకు చెందిన దివ్యాంగుల జట్లు పాల్గొననున్నాయి. మ్యాచ్లు జరిగే చోటకు పవన్ కళ్యాణ్ వెళ్ళి వారిని ఉత్సాహపరిచే అవకాశం కూడా ఉన్నట్టు సమాచారం.