తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎన్నాళ్ళో వేచిన ఉదయం రానే వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిశ్రమకు చాలా కాలం తరువాత మొదటి గుడ్ న్యూస్ చెప్పింది. రేపటి నుండి థియేటర్లలో 100% ఆకుపెన్సీ ఇచ్చింది.
అలాగే నైట్ కర్ఫ్యూ అర్ధరాత్రి 12 నుండి ఉదయం ఐదు గంటలకే పరిమితం చేసేయ్యడంతో సెకండ్ షోల పర్మిషన్ కూడా ఇచ్చేసినట్టు అయ్యింది. సరిగ్గా రేపు మహాసముద్రం, ఎల్లుండి మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ సమయంలో ఈ ప్రకటన రావడం గమనార్హం.
ఇది ఇలా ఉండగా.. జగన్ బంధువు, వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతుదారుడైన మంచు విష్ణు మా ప్రెసిడెంట్ అయిన సందర్భంగా ప్రభుత్వం ఈ ప్రకటన ఇచ్చిందా అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది.
సహజంగా అయితే దీనికి క్రెడిట్ తీసేసుకోవాలి విష్ణు. కాకపోతే అటువైపు ఉన్నది జగన్… జగన్ విషయంలో జరిగేది ఏదైనా క్రెడిట్ ఆయన ఖాతాలోకే వెళ్ళాలి. కాదని ఇంకెవరైనా ట్రై చేస్తే మొత్తానికే మోసం వస్తుంది. సహజంగా మంచు ఫ్యామిలీ క్రెడిట్ తీసుకోవడానికి మొహమాటపడదు కాకపోతే జగన్ వల్ల కావొచ్చు.. క్రెడిట్ తీసకునే ధైర్యం కూడా చెయ్యడం లేదు.